తెలంగాణ సీఎం కేసీఆర్తో తనను పిలవక పోవడంపై తప్పు తీసిన నందమూరి బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం మీడియాలో చాలా రచ్చ చేసిన విషయం తెల్సిందే.చిరంజీవి నేతృత్వంలో సాగిన ఆ చర్యలకు కావాలనే బాలయ్యను దూరం పెట్టారు అంటూ ఒక వర్గం వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
బాలకృష్ణతో చిరంజీవికి ఉన్న ఈగో గొడవల వల్లే పిలవలేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మీటింగ్కు పిలవక పోవడం తప్పు అంటూ బాలయ్య అభిమానులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఏపీ సీఎం జగన్తో భేటీకి సిద్దం అయిన సినీ ప్రముఖులు ఈసారి బాలకృష్ణను ఆహ్వానించారు.రాజకీయ కారణాల వల్ల జగన్తో భేటీకి బాలకృష్ణ ఆసక్తి చూపడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్న బాలకృష్ణ సీఎం జగన్తో భేటీ అయితే టీటీపీ వర్గాల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో బాలయ్య ఈనెల 9వ తారీకున జరుగబోతున్న సమావేశంకు నో చెప్పాడట.ఈ విషయంలో ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.
కేసీఆర్తో భేటీకి ఆహ్వానించలేదు అంటూ విమర్శలు చేసిన బాలయ్య ఇప్పుడు జగన్తో భేటీకి ఆహ్వానిస్తే మాత్రం తప్పించుకునేందుకు సాకులు చెబుతున్నాడు.,సినిమా పరిశ్రమ కష్టాలు నష్టాలపై చిత్తశుద్ది ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఈ భేటీకి హాజరు అయ్యేవాడు అంటూ ఇప్పుడు కొందరు బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు.మొత్తానికి మొన్నటి వరకు తప్పు చిరంజీవి వైపు ఉండగా ఇప్పుడు మాత్రం బాలయ్య వైపుకు ఆ తప్పు వెళ్లింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.