నందమూరి బాలకృష్ణ ఈమధ్య మంచి దూకుడు మీద ఉన్నారు.రీసెంట్ గానే అఖండ హిట్ తో జోష్ మీద ఉన్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో ఫిక్స్ చేసుకున్నాడు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత అసలైతే బాలకృష్ణ అనీల్ రావిపుడి, పూరీ జగన్నాథ్ డైరక్టర్స్ తో సినిమా చేస్తారని వార్తలు రాగా లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో మరో డైరక్టర్ చేరాడు.
బాలకృష్ణ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది.
టాలీవుడ్ లో మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది రీసెంట్ గా గోపీచంద్ తో సీటీమార్ సినిమా చేశారు.ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది.
బాలకృష్ణ కు సరిపోయే ఓ మాస్ కథ సిద్ధం చేశారట సంపత్ నంది.ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది.
ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే మాత్రం సంపత్ నంది.బాలయ్య కాంబో ఫిక్స్ అయినట్టే.