నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి తనదైన మార్క్లో తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో బాలయ్యను రెండు విభిన్న పాత్రల్లో మనకు చూపించేందుకు బోయపాటి సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత బాలయ్య ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే బాలయ్య మాత్రం తనకు ఎంతో ఇష్టమైన ఎవర్గ్రీన్ మూవీ ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్లో ‘ఆదిత్య 999’ సినిమాను క్యూలో పెట్టాలని బాలయ్య చూస్తున్నాడు.ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు.
కాగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
అటు బాలయ్య ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ రికార్డులను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా బాలయ్య ఓ మలయాళ చిత్ర రీమేక్లో నటిస్తాడని, ఇది మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు చిత్ర విశ్లేషకులు.కాగా బాలయ్య-బోయపాటి చిత్రంలో బాలయ్య సరసన నటించేందుకు ఇద్దరు కొత్త హీరోయిన్లను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.