బోయపాటి తరువాత సీక్వెల్‌కే ఓటేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 Balakrishna Ready For Aditya 369 Sequel, Balakrishna, Boyapati Srinu, Aditya 369-TeluguStop.com

కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి తనదైన మార్క్‌లో తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో బాలయ్యను రెండు విభిన్న పాత్రల్లో మనకు చూపించేందుకు బోయపాటి సిద్ధమవుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత బాలయ్య ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే బాలయ్య మాత్రం తనకు ఎంతో ఇష్టమైన ఎవర్‌గ్రీన్ మూవీ ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్‌లో ‘ఆదిత్య 999’ సినిమాను క్యూలో పెట్టాలని బాలయ్య చూస్తున్నాడు.ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.

కాగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

అటు బాలయ్య ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ రికార్డులను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా బాలయ్య ఓ మలయాళ చిత్ర రీమేక్‌లో నటిస్తాడని, ఇది మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు చిత్ర విశ్లేషకులు.కాగా బాలయ్య-బోయపాటి చిత్రంలో బాలయ్య సరసన నటించేందుకు ఇద్దరు కొత్త హీరోయిన్లను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube