ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలు రాగా.
వారిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడంతో.ఈ మూడో సినిమాపై సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదలవ్వగా… ఇందులో బాలయ్య లుక్, డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
కరోనా ప్రభావం, లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోగా.ప్రస్తతం కరోనా ప్రభావం తగ్గిన క్రమంలో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు.
వీలైనంత త్వరంగా షూటింగ్ను పూర్తి చేయాలని బోయపాటి భావిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.
రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో బాలయ్య కోసం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒక కథను సిద్ధం చేసినట్లు సమాచారం.ఇప్పటికే ఈ కథను బాలయ్యకు వినిపించాడట.ఇక బాలయ్యకు కూడా ఈ కథ నచ్చడంతో పూరీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను పూరీ తెరకెక్కిస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి పూర్తి కానుంది.ఇది పూర్తైన తర్వాత బాలయ్య సినిమాపై పూరీ వర్క్ చేయనున్నాడు.