నందమూరి బాలకృష్ణకు ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల్లో చాలా కోపిష్టి అనే పేరు ఉంది.తన అభిమానులను ఎడాపెడా కొడతాడే నింద ఆయనపై వేశారు యాంటీ ఫ్యాన్స్.
అయితే బాలయ్య మంచితనం గురించి ఆయన్ను అర్ధం చేసుకున్నవారికి, ఆయనతో కలిసి ఉండే వారికి మాత్రమే తెలుస్తుంది.చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ బాలయ్య తన మంచితనాన్ని చాటుకుంటున్నారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ సోకిందని తెలుసుకుని ఆమెను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యులచే ఉత్తమ వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాడు బాలయ్య.అదేంటి.
ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ వచ్చిందా? అని మీరు ఆశ్చర్యపోకండి.అసలు విషయం ఏమిటంటే.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన పి.విజయ్ కుమార్ భార్యకు క్యాన్సర్ ఉందని తేలింది.
దీంతో ఆయన తన భార్యను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకురాగా, విషయం తెలుసుకున్న బాలయ్య ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని వైద్యులను కోరినట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాలయ్య బాబు మనసు బంగారం అంటూ నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ అభిమాన నటుడు ఏది చేసినా బాగుంటుందని వారు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.