నటరత్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
అందులో ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.ఆగష్టులో ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తనకి సూపర్ హిట్ సినిమాలు అందించిన బి గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధం అవుతుంది.
దీని మీద స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా వర్క్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన మరో అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.
బి.గోపాల్ రూపొందించే చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.రైతు సమస్యల నేపథ్యంలో ఇది ఉంటుందని తెలుస్తుంది.దీనికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోంది.ఇక ఈ సినిమా కథపై పరుచూరి బ్రదర్స్ కూడా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇండస్ట్రీలో బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ అంటే వెంటనే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లాంటి ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు గుర్తుకొస్తాయి.
మరి బోయపాటి సినిమా తర్వాత రాబోతున్న వీరి కాంబినేషన్ సినిమా ఆ స్థాయిలో హిట్ అందుకుంటుందా అనేది చూడాలి.