బాలకృష్ణకి అంత సీన్ లేదు అంటున్న ఎంపీ

టీడీపీ ఎమ్మెల్యే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని మూడు రాజధానులకి మద్దతు తెలపాలని ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.ఇక ఆ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను సైగ చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని.

 Balakrishna Pawan Kalyan Suresh-TeluguStop.com

రాజ్యాంగం మీద గౌరవంతో సైలెంట్ గా ఉన్నా అని అన్నారు.మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దని వైసీపీ నేతలని విమర్శించారు.

అయితే తాజాగా అమరావతి ప్రాంతంలో వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ ని రైతులు అడ్డుకొని శాంతియుతంగా నిరసన తెలిపి అమరావతికి మద్దతు తెలపాలని కోరారు.ఈ ఆందోళన అనంతరం నందిగామ సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం బాలకృష్ణ సినిమా చేస్తున్నాడని అందుకే సినిమా డైలాగ్స్ చెబుతున్నాడని ఎద్దేవా చేశాడు.అయిన బాలకృష్ణకి అంత సీన్ లేదని, తనకి తాను ఏదో ఊహించుకున్తున్నాడని విమర్శించాడు.

అంత దమ్మున్న వ్యక్తి బాలయ్య అయితే తన భావని అడిగి ఒక్క మంత్రి పదవి తెచ్చుకోలేకపోయాడని, అలాగే ఎన్టీఆర్ నుంచి టీడీపీ పార్టీని లాక్కున్నప్పుడు ఏం చేసారని ప్రశ్నించారు.అతని మాటలు లేక్కచేయాల్సిన అవసరం లేదని అన్నారు.

అలాగే ఒక స్టార్ హీరో అయ్యి ఉండి రెండు చోట్ల ఓడిపోయినా వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అతను త్వరలో పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube