నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ల మధ్య గత కొంత కాలంగా సఖ్యత లేదు అనే విషయం తెల్సిందే.ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
వీరిద్దరి ఫ్యాన్స్ కూడా విడిపోయారు.ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్లు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.
అయినా కూడా ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనత గ్యారేజ్’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సెట్స్కు బాలయ్య వెళ్లబోతున్నాడు.జనత గ్యారేజ్ సెటింగ్కు ఎన్టీఆర్ కోసం బాలయ్య వెళ్లడం లేదు.
అదే సినిమా షూటింగ్లో మోహన్ లాల్ పాల్గొంటున్న విషయం తెల్సిందే.ఆయన్ను కలిసేందుకు బాలయ్య సెట్స్కు వెళ్లనున్నాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్తో బాలకృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
ఆ కారణం చేతే మోహన్లాల్ను కలిసేందుకు బాలకృష్ణ ‘జనత గ్యారేజ్’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సెట్స్కు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.అదే సమయంలో అక్కడే ఉన్న ఎన్టీఆర్తో సైతం బాలకృష్ణ మాట్లాడుతాడు అంటూ నందమూరి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు.
నందమూరి హీరోలు బాబాయి, అబ్బాయిల కలయిక కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి వారి ఎదురు చూపులకు త్వరలోనే బ్రేక్ పడనుందా, ఎన్టీఆర్, బాలయ్యలు ‘జనత గ్యారేజ్’ సెట్స్లో సందడి చేస్తారా అనేది చూడాలి.