ఒకే వేదిక మీదకి బాబాయ్- అబ్బాయ్ లు... నందమూరి ఫాన్స్ కి పండగే

నందమూరి బాలకృష్ణ, తారక్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ తమ ప్రస్తానం సాగిస్తున్న హీరోలుగా ఉన్నారు.అయితే ఆ మధ్య కాలంలో కొన్ని కుటుంబ కలహాల కారణంగా బాలకృష్ణ తారక్, కళ్యాణ్ రామ్ ని దూరంగా ఉంచాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

 Balakrishna Ntr Entha Manchivaadavuraa-TeluguStop.com

ఇదిలా ఉంటే ఆ మధ్య హరికృష్ణ మరణం తర్వాత ఏకమైన నందమూరి ఫ్యామిలీ అప్పటి నుంచి కాస్తా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.అయితే సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఎక్కువగా సందడి చేయలేదు.

అయితే చాలా కాలం తర్వాత మరల బాబాయ్, అబ్బాయ్ లు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు.జనవరి 8 ఈ కలయికని నందమూరి చూడబోతున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచి వాడవురా అనే సినిమా తెరకెక్కింది.గ్రామీణ నేపధ్యంలో నడిచే ఈ సినిమాలో హీరోయిన్ మెహరీన్ నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని జనవరి 15న రిలీజ్ కి రెడీ అవుతుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 8న జరగనుంది.ఇక ఈ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తుంది.

ఇక అదే జరిగితే నందమూరిహీరోలని ఒకే వేదిక మీద చూసుకునే అవకాశం నందమూరి ఫాన్స్ కి దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube