కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఛాలెంజ్లతో టైం పాస్ చేసుకుంటూ ఉన్నారు.ఆమద్య రకుల్ ప్రీత్ సింగ్ కాళ్లు పైకి పెట్టి చేతులు కిందికి పెట్టి టీ షర్ట్ వేసుకునే ఛాలెంజ్ను చేసిన విషయం తెల్సిందే.
ఆ ఛాలెంజ్ను పలువురు స్వీకరించి చేశారు.ఇక ప్రస్తుతం స్టార్స్ బి ది రియల్ మన్ ఛాలెంజ్ను చేస్తున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ ఛాలెంజ్ను రాజమౌళికి చేయగా, ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్లకు చేసిన విషయం తెల్సిందే.ఎన్టీఆర్ ఛాలెంజ్ను స్వీకరించి ఇంటి పని చేసి పలువురిని నామినేట్ చేశాడు.
ఈ ఛాలెంజ్లో భాగస్వామ్యం కావాల్సిందిగా బాలయ్య బాబాయికి సవాల్ విసిరాడు.ఇదే సమయంలో నాగార్జున, చిరంజీవి, వెంకటేష్లకు కూడా ఈ ఛాలెంజ్ను చేశాడు.చిరంజీవి ఇప్పటికే ఆ ఛాలెంజ్ను స్వీకరించాడు.ఇక నాగార్జున, వెంకటేష్లు కూడా ఆ ఛాలెంజ్ కు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.
కాని బాలయ్య మాత్రం ఇలాంటివి అస్సలు పట్టించుకోడు.అది కూడా ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ చేయడంతో బాలయ్య బాబు పట్టించుకోవడం అనుమానమే అంటున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ కు ఎన్టీఆర్కు అంత మంచి సంబంధాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు.ఇలాంటి సమయంలో బాలకృష్ణను ఎన్టీఆర్ ఇలా ఛాలెంజ్ చేయడంతో సినీ వర్గాల్లో ఇంకా మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.ఎన్టీఆర్ ఛాలెంజ్ను స్వీకరించినట్లయితే తన ఈగో దెబ్బ తింటుంది.ఒకవేళ ఎన్టీఆర్ ఛాలెంజ్ను బాలయ్య ఒప్పుకోకుంటే బాలయ్యపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.బాలయ్యను విపత్కర పరిస్థితుల్లో పడేసిన ఎన్టీఆర్పై నందమూరి ఫ్యాన్స్ ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.