నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా పూర్తిగాకముందే బాలయ్య నెక్ట్స్ చిత్రం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ ఒప్పందం చేసుకున్నాడు.దీంతో ఈ సినిమాలో బాలయ్యను హీరోగా తీసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గోపీచంద్ మలినేని ఓ పవర్ఫుల్ కథను కూడా రెడీ చేసాడని, త్వరలోనే బాలయ్యకు ఇది వినిపిస్తాడని చిత్ర వర్గల్లో టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి క్రాక్ చిత్రం అందించిన సక్సెస్తో గోపీచంద్ మలినేని తన నెక్ట్స్ చిత్రాన్ని బాలయ్య లాంటి స్టార్ హీరోతో చేసే అవకాశం కొట్టేశాడని సినీ క్రిటిక్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమాను అతి త్వరలో అఫీషియల్గా అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.మరి బాలయ్యతో ఈ క్రాక్ డైరెక్టర్ ఎలాంటి క్రాక్ చిత్రం తీస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.
కాగా బోయపాటి డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.