నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రానికికి నిర్మాత విషయంలో కొంత సందిగ్ధం నెలకొనడంతో వాయిదా పడింది.
తాజాగా ప్రముఖ సినీ నిర్మాత రవీందర్ రెడ్డి ఓకే చెప్పడంతో ఈ చిత్రం తొందర్లోనే పట్టాలెక్క నుంది.అంతేగాక ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి చిత్ర షూటింగ్ ని వచ్చేనెల 15వ తారీకు నుండి మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న టువంటి బాలయ్య బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఎందుకంటే గతంలో బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చినటువంటి సింహ, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ చిత్రాలుగా నిలిచిపోయాయి.
అయితే ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం గూర్చి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన బ్యూటిఫుల్ కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల బాలయ్య బాబు నటించినటువంటి రూలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో బాలయ్య బాబు ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అంతేగాక బాలకృష్ణ నటించిన టువంటి పలు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో ఒకరకంగా చూస్తే బాలయ్య బాబు సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.