నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకుని చాలా రోజుల తర్వాత విజయం అందుకున్నాడు.ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.
ప్రెసెంట్ యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107 వ సినిమా చేస్తున్నాడు.
గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా మనం ఊహించని రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
బాలయ్య కు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ను నిలిపి వేశారు.అయితే ఈయనకు మళ్ళీ నెగిటివ్ రావడంతో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.
కానీ ఇంతలోనే మళ్ళీ బాలయ్య అభిమానులకు ఇది షాకింగ్ వార్త అని తెలుస్తుంది.
ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 9 నుండి స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఈ సినిమా టీమ్ లో మరికొంత మంది కీలక సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేసారట.ఇది బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.మరి ఈ సభ్యులు కోలుకున్న తర్వాతనే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.