నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.తన కెరీర్ లో ఎప్పుడు లేనంత జోష్ తో సినిమాలు ప్రకటిస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.ఇటీవలే అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు.వీరసింహా రెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించ డానికి రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో 9 గంటల 36 నిముషాలకు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు మేకర్స్.
గ్రాండ్ లాంచింగ్ లో ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని అనేక మంది సినీ ప్రముఖుల మధ్య జరిగింది.దీనికి సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ ఒక భారీ జైలు సెట్టింగ్ లో సినిమాను అదిరే యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో సినిమా ఎలా ఉంటుందో.బాలయ్య లాంటి యాక్షన్ హీరోను అనిల్ ఎలా మేనేజ్ చేస్తాడో.ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటించ బోతుంది అని ఇప్పటికే అనిల్ కన్ఫర్మ్ చేసేసాడు.
మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.