బాలకృష్ణ 16 సంవత్సరాల క్రితం మొదలు పెట్టి కేవలం 9 నిమిషాల నిడివి కలిగిన సీన్స్ ను చిత్రీకరించిన నర్తనశాల మూవీని శ్రేయాస్ ఈటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఈ సినిమా నిడివి పెంచేందుకు గాను ఎన్టీఆర్ నటించిన నర్తనశాల ఫుటేజ్ను కాస్త కలపడంతో పాటు బాలకృష్ణ టాప్ హీరో సినిమాలో కొద్ది సమయం బృహన్నల గెటప్ లో కనిపిస్తాడు.
ఆ ఫుటేజ్ను కూడా ఈ సినిమా కోసం వాడారు.మొత్తానికి బాలకృష్ణ 9 నిమిషాలు చిత్రీకరిస్తే దాన్ని 15 నిమిషాలకు పెంచారు.
ఎడిటింగ్ లో కాస్త అటు ఇటు గా ఉన్నా కూడా ఇది చూసిన తర్వాత బాలకృష్ణ నర్తనశాల పూర్తి చేస్తే ఎంత బాగుంటుంది అంటూ నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య సినీ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఈ నర్తనశాల అలా శాస్వతంగా నిలిచి పోయేది.
కాని బాలయ్య అనేక కారణాల వల్ల సినిమాను మద్యలోనే వదిలేశాడు.
సినిమాలో బాలకృష్ణతో పాటు భీముడి పాత్రలో శ్రీహరి ద్రౌపతి పాత్రలో సౌందర్యలు కనిపించారు.
వారిని స్క్రీన్ పై చూస్తూ ఉంటే వారిని మిస్ అయినందుకు వారి వారి అభిమానులు మరోసారి కన్నీరు పెట్టుకుంటారు.మొత్తానికి ఈ సినిమా ఛారిటీ కోసం బాలయ్య విడుదల చేశాడు.
ఇంకాస్త ఎక్కువ సమయం ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా ఉంది.బాలయ్య కేవలం వారం రోజులు మాత్రమే తెరకెక్కించినా షూట్ చేసినంత వరకు కూడా చాలా బాగా వచ్చిందని, అచ్చ తెలుగు పదాలతో బాలయ్య మరియు ఇతర యూనిట్ సభ్యులు నర్తనశాల కోసం ఎలా కష్టపడ్డారో ఆ చిన్న వీడియోతోనే తెలిసి పోతుంది.
నందమూరి అభిమానులు ఈ సినిమాను విపరీతంగా చూసేస్తున్నారు.ఈ సినిమాను ఛారిటీ కోసం విడుదల చేశారు కనుక నందమూరి అభిమానులు టికెట్ రేటు రూ.50 అయినా కూడా వందలు వేలు కూడా పెట్టి టికెట్ను కొనుగోలు చేస్తున్నారు.