నందమూరి బాలకృష్ణ కొంతగ్యాప్ తరువాత తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, షూటింగ్ను ఏప్రిల్లో ప్రారంభించాలని అనుకున్నారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
కాగా తన నెక్ట్స్ మూవీని కూడా బాలయ్య వీలైనంత త్వరగా ఓకే చేయాలని చూస్తున్నాడట.
ఈ క్రమంలో బాలయ్యకు పైసా వసూల్ వంటి క్రేజీ మూవీని అందించిన టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, మరోసారి బాలయ్యతో కలిసి చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే బాలయ్య కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేస్తు్న్నాడట పూరీ.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పూరీ రెడీ అవుతున్నాడు.మరి ఈసారి బాలయ్య కోసం పూరి ఎలాంటి కథతో రాబోతున్నాడో చూడాలి అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.