నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘లయన్’.బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష మరియు రాధిక ఆప్టేలు నటించారు.
సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణరావు ఈ సినిమాను నిర్మించాడు.ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉంది.
అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదా పడ్డట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా ఈ సినిమా వాయిదాపై నిర్మాత రుద్రపాటి రమణరావు స్పందించాడు.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానందునే విడుదల వాయిదా వేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
తాజాగా ఈయన మాట్లాడుతూ.
‘లయన్’ సినిమాను మే 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, బాలయ్య ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేసే సినిమాగా ఇది ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాను త్వరలో సెన్సార్ ముందుకు తీసుకు వెళ్తాము అని, త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తాము అంటూ పేర్కొన్నాడు.
ఈ సినిమాలో బాలయ్య సీబీఐ ఆఫీసర్గా కనిపించనున్నాడు.ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో చర్చించినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎమ్మెల్యే అయిన తర్వాత బాలయ్య నటించిన మొదటి సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భావిస్తున్నారు.మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.