సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.పవన్ తన ప్రసంగంలో భాగంలో ఏపీ టికెట్ రేట్ల సమస్య గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి స్టేజ్ పైకి ఎక్కి పవన్ దగ్గరకు రాగా పవన్ ఆ వ్యక్తిపై సీరియస్ కావడం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం తెలిసిందే.
అయితే స్టేజ్ పైకి వచ్చిన వ్యక్తి ఎవరనే క్లారిటీ లేకపోవడం వల్ల పవన్ తన ఫ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని కామెంట్లు వినిపించాయి.
అయితే పవన్ ఏ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారో అదే వ్యక్తి అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాగా బాలకృష్ణ ఆ వ్యక్తికి ఫ్లవర్ బొకే ఇచ్చారు.పవన్ అభిమానులు ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది.
రిపబ్లిక్ ఈవెంట్ లో స్టేజ్ పైకి వచ్చిన ఈ వ్యక్తి పవన్ అభిమాని కాదు.
ఆరోజు హంగామా చేసిన ఈ వ్యక్తి ఈవెంట్ మేనేజర్ అని సమాచారం.
పవన్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడని నెటిజన్లు, పవన్ అభిమానులు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి ఈరోజు విడుదల కావాల్సిన అడవితల్లి సాంగ్ పోస్ట్ పోన్ చేస్తున్నామని యూనిట్ ప్రకటించింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం వల్లే ఈ సాంగ్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు.ఇలాంటి ఘటన జరిగిన సమయంలో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోగట్టా.సోషల్ మీడియా ద్వారా నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.