నందమూరి బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో మరోసారి తమ అభిమాన హీరోను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా యొక్క విజయోత్సవ వేడుక లో బాలకృష్ణ మాట్లాడుతూ ఆ రంగారావు.
ఈ రంగారావు మరియు అక్కినేని తొక్కనేని ల గురించి మాట్లాడుకుంటాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం ను రేపుతున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ లోకి బాలకృష్ణ ను అడుగు పెట్టనివ్వకూడదు అంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు.అక్కినేని ఫ్యాన్స్ చేసిన హంగామా తో రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.
ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ కు వ్యతిరేకంగా విమర్శలు వస్తున్నాయి.ఇదే సమయంలో రంగారావు మనవల్లు మాత్రం మా తాతగారి గురించి బాలకృష్ణ గారు తప్పుగా మాట్లాడినట్లుగా మాకు అనిపించడం లేదు.
కనుక ఆయన గురించి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అంటూ వారు పేర్కొన్నారు.కానీ అక్కినేని ఫ్యాన్స్ విషయంలో మాత్రం బాలకృష్ణ అభిమానులకు పెద్ద తలనొప్పి అన్నట్లుగా ఉంది.నాగ చైతన్య మరియు అఖిల్ లు స్పందిస్తూ ఏయన్నార్ ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నట్లుగా ఇండైరెక్ట్ గా బాలకృష్ణ కు కౌంటర్ ఇచ్చి ఊరుకున్నారు.
నాగార్జున మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ పట్టింపు లేనట్లుగా ఉన్నారు.కానీ అక్కినేని ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న కొందరు రాజకీయ ముసుగులో బాలకృష్ణ పై విమర్శలు చేస్తున్నారు అంటూ నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో అసలు ఫ్యామిలీకి లేని నొప్పి మీకు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో ఈ విషయం గురించి మాట్లాడుకునే వారిపై విమర్శలు చేస్తున్నారు.
ఆ ఫ్యామిలీ కే లేని ఇబ్బంది మీకు ఎందుకు అంటూ నెటిజన్స్ కామెంట్స్ వస్తున్నాయి.