నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.మరో రెండు మూడు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి పరిస్థితులు అనుకూలించిన వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి.
ఇక బాలయ్య తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతుంది.ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దం అయ్యింది.
ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమా తో వచ్చిన గోపీచంద్ మలినేని తదుపరి సినిమా గా బాలయ్య తో చేసేందుకు సిద్దం అయ్యాడు.రియల్ ఇన్సి డెంట్స్ తో కథను అల్లినట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు.కాని సోషల్ మీడియాలో రకరకాల పేర్లు పరిశీలనకు వస్తున్నాయి.
ఈ సమయంలోనే త్రిష పేరు ను ప్రముఖంగా కొందరు ప్రచారం చేస్తున్నారు.బాలయ్యతో త్రిష అంటే అభిమానులు కంగారు పడుతున్నారు.
గతంలో బాలయ్య.త్రిషల కాంబోలో సినిమా వచ్చింది.అది బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం వల్ల మళ్లీ వారిద్దరి కాంబోనే అభిమానులు కాని ఇండస్ట్రీ వర్గాల వారిని కాని నమ్మే పరిస్థితి లేదు.
అందుకే వీరి కాంబో లో మూవీ కి అభిమానులు ఎవరు ఆసక్తి గా లేరు.కనుక గోపీచంద్ మలినేని ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరుకుంటున్నారు.
మీడియాలో వస్తున్న ఈ పుకార్లు నిజం కాదని తేలాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు.త్రిష కాకుండా మరెవ్వరైనా హీరోయిన్ గా ఈ సినిమా లో నటించాలని వారు ఆశ పడుతున్నారు.
త్వరలోనే హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అభిమానులు కోరినట్లుగా ఆ వార్తలు పుకార్లేనా లేదా అనేది అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.