పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాలో బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.సినిమాలో మైక్ టైస విలన్ గా నటించే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.
లైగర్ లో టైసన్ అనగానే సినిమాపైన అంచనాలు డబుల్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కు డబ్బింగ్ ను నందమూరి నటసింహం బాలకృష్ణ అందిస్తారని లేటెస్ట్ టాక్.
బాలకృష్ణ ఏంటి డబ్బింగ్ ఇవ్వడం ఏంటని షాక్ అవ్వొచ్చు.పూరీ, బాలకృష్ణ కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చింది.ఆ చనువుతోనే బాలయ్యని వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడట పూరీ.అందుకు బాలయ్య కూడా ఓకే అన్నట్టు టాక్.
లైగర్ సినిమాలో టైసన్ కు బాలకృష్ణ వాయిస్ అందించారని టాక్.అదే నిజమైతే లైగర్ సినిమాకు బాలయ్య బాబు వాయిస్ కూడా ఒక పెద్ద అసెట్ అని చెప్పొచ్చు.
అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈమధ్య బాలయ్య బాబు లైగర్ యూనిట్ ను కలిసి విష్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ టైం లోనే మైక్ టైసన్ కు బాలయ్య బాబుని డబ్బింగ్ ఇవ్వమని పూరీ అడిగినట్టు తెలుస్తుంది.అందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్టు టాక్.