నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది.
బాలయ్య బాబు ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో అదరగొట్టేస్తారని చెబుతున్నారు.క్రాక్ తో మాస్ అండ్ కమర్షియల్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ కు పండుగ.అలాంటి ఆయన్ను అదే రేంజ్ మాస్ డైరక్టర్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
సినిమాలో కూడా క్రాక్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన జయమ్మ పాత్రధారిణి వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందని తెలుస్తుంది.తప్పకుండా ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాకు టైటిల్ గా జై బాలయ్య అని పెట్టే ఆలోచలో ఉన్నారు.తప్పకుండా ఈ కాంబో మరో క్రేజీ హిట్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య బాబు.ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.