దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసందే.
లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోయింది.అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమలు ముందుకు వచ్చి విరాళాలను అందజేశారు.
అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలను, సినీ కార్మికుల కోసం టాలీవూడ్ హీరోలు ముందుకు వచ్చి విరాళాలు అందజేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే.
ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.
ఇందుకు సంబంధించి అసలు విషయం చూస్తే… హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలయ్య తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.తన నియోజవర్గంలోని ప్రభుత్వ హాస్పటల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాలకు 55 లక్షల విలువైన మెడిసన్స్, పీపీఈ కిట్లను, మాస్కులను ఇతర సామాగ్రిని విరాళంగా అందజేశారు.
అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయల చెక్ ని అందజేశారు.
ఇవేకాకుండా మళ్లీ ప్రత్యేకంగా సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలను బాలయ్య బాబు అందజేశారు.ప్రస్తుతం బాలకృష్ణ బిబి3 సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నిర్మిస్తున్నారు.ఇది వీరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా.
అయితే కరోనా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన కారణంగా, తిరిగి అతి త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని టాలీవుడ్ సమాచారం.