సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఎప్పుడూ వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకునే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాకు మినహా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అయితే గత వారం రోజుల నుంచి యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకక్కుతున్న ఒక సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది.
నాగశౌర్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలకృష్ణను నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సంప్రదించారని బాలకృష్ణ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.గతంలో ఒక సందర్భంలో బాలకృష్ణ సరైన కథ దొరికితే ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.అయితే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను బాలయ్య డిమాండ్ చేశారని వినిపిస్తోంది.
దీంతో నిర్మాత బాలకృష్ణను తీసుకోవాలో వద్దో అని ఆలోచిస్తున్నారని సమాచారం.శివలెంక కృష్ణ ప్రసాద్ గతంలో బాలకృష్ణతో ఆదిత్య 369, వంశానికొక్కడు సినిమాలతో పాటు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
బాలకృష్ణతో ఉన్న అనుబంధం వల్లే నిర్మాత సినిమాలో నటింపజేయాలని ప్రయత్నం చేశారు.అయితే బాలకృష్ణ రెమ్యునరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్న నిజమో కాదో తేలాల్సి ఉంది.
బాలకృష్ణ తన సినీ కెరీర్ లో అతిథి పాత్రల్లో ఎక్కువగా నటించలేదు.అయితే సరైన కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాల్లో సైతం నటించడానికి సిద్ధమే అని బాలకృష్ణ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోవైపు నాగశౌర్య వరుసగా సినిమాలకు కమిటవుతూ ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో కథల విషయంలో, దర్శకుల విషయంలో నాగశౌర్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.