టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలయ్య నియోజకవర్గమైన హిందూపూర్ లోని గోరంట్ల బస్టాండ్ లో మొబైల్ ఫోన్ పేలడంతో కొంత సమయం గందరగోళం నెలకొంది.ఊహించని ఈ ఘటనతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
మొబైల్ పేలిన ఘటనలో మహిళ చేతికి తీవ్ర గాయాలు కాగా తృటిలో ప్రాణాపాయం తప్పింది.గోరంట్లలో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పూర్తి వివరాలలోకి వెళితే గోరంట్లకు చెందిన ప్రకృతి అనే వ్యక్తి తన భార్య రష్మి మరియు కుటుంబ సభ్యులతో కలిసి గోరంట్ల బస్టాండ్ కు వచ్చాడు.బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రకృతి భార్య రష్మి ప్రకృతిని మొబైల్ అడిగింది.
ప్రకృతి రష్మి చేతికి మొబైల్ ఇవ్వగా మొబైల్ ఆన్ చేసిన వెంటనే మొబైల్ పేలడంతో రష్మి షాక్ కు గురైంది.వెంటనే మొబైల్ ఫోన్ ను రష్మి దూరంగా విసిరేసింది.
ఈ ఘటనలో రష్మి చేతికి గాయాలు కావటంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.వైద్యులు చికిత్స అందించి యువతి కొన్ని రోజుల్లో కోలుకుంటుందని చెప్పారు.
సెల్ ఫోన్ ను ఎక్కువ సమయంలో చార్జింగ్ లో ఉంచడం వలనే ఫోన్ పేలినట్టు సమాచారం.గతంలో కూడా ఫోన్లు పేలిన ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా కొందరు ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
టెక్ నిపుణులు మొబైల్ ఫోన్లను బ్యాటరీ ఫుల్ అయిన తరువాత ఛార్జ్ చేయవద్దని, ఒరిగినల్ ఛార్జర్లనే వాడాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సెల్ ఫోన్ పేలదని చెబుతున్నారు.