నందమూరి హీరో లు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ల మద్య ఏదో విషయంలో గొడవ ఉంటూనే ఉంటుందని అంతా అంటూ ఉంటారు.నందమూరి అభిమానులు మాత్రం తమ హీరోలు చాలా క్లోజ్ గా ఉంటారు.
అందరి చూడా క్లోజ్ గా ఉండాల్సిన అవసరం లేదంటూ ఉంటారు.నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.
అది మళ్లీ చర్చకు తెర తీసింది.బాలయ్యకు అబ్బాయి శుభాకాంక్ష లు తెలియజేశాడు.
ఇక ఏమీ గొడవలు లేవు అంటూ అంతా అనుకున్నారు.కాని అదే రోజు బాలకృష్ణ టీవీ9 తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇద్దరి మద్య వైరం ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేశాడు.బాబాయి మరీ దారుణంగా అబ్బాయిని తీసేశాడు అంటూ స్వయంగా అభిమానులు పెదవి విరిస్తున్నారు.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఎన్టీర్ ఒక వేళ తెలుగు దేశం పార్టీ లోకి వస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించగా ఆయన మౌనం గా ఉన్నాడు.కొద్ది సమయం తర్వాత కార్యకర్తలు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ లోకి రావాలని ఆయన వస్తే ప్లస్ అవుతుందని అంటున్నారు కదా అంటూ ప్రశ్నించగా బాలకృష్ణ వెంటనే స్పందిస్తూ ఎన్టీఆర్ వస్తే ప్లస్ అవ్వొచ్చు లేదా మైనస్ అవ్వచ్చు.ఏదైనా అవ్వచ్చు కదా.ప్లస్ మైనస్ అంటూ ఏదో డైలాగ్ చెప్పశాడు.
అది అర్థం కాలేదు కాని మొత్తానికి అయితే ఇంకా బాలయ్య వ్యవహారం ఎన్టీఆర్ కు వ్యతిరేకంగానే ఉందని అభిమానులు కూడా అనుకుంటున్నారు. బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ల మద్య ఎప్పటికి సఖ్యత ఏర్పడుతుంది అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇద్దరు కలిసి నటిస్తే బాగుండు అనుకుంటున్న అభిమానులు ఈ గొడవ చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.