తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ ముఖ్యంగా కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ల మద్య ఉంది.గత ఏడాది చివర్లో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది.
ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ రంగంలోకి దిగగా తామేం తక్కువ కాదు అంటూ టీడీపీ కూడా రంగంలోకి దిగింది.టీడీపీకి అసలు డిపాజిట్ దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఆ పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయికి మద్దతుగా తెలుగు దేశం పార్టీముఖ్య నేతలు ప్రచారంకు సిద్దం అవుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ వారం నుండి పది రోజుల పాటు హుజూర్ నగర్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇక హిందూపురం ఎమ్మెల్యే ఏపీ టీడీపీ ముఖ్య నాయకుడు బాలకృష్ణ కూడా హుజూర్ నగర్ ప్రచారంలో పాల్గొనబోతున్నాడట.ఏకంగా అయిదు రోజుల పాటు హుజూర్ నగర్లో మకాం వేసి మరీ బాలకృష్ణ ప్రచారం చేయబోతున్నట్లుగా ఆ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.
ఏపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ఉబలాట పడుతుంది.కాని ఎంత ప్రయత్నించినా కూడా టీడీపీ అక్కడ గెలవడం అసాధ్యం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.