నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం తరువాత తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తీయబోతున్నట్లు ప్రకటించి చాలా రోజులు అవుతుంది.ఈ సినిమాను అఫీషియల్గా కూడా లాంఛ్ చేశారు.
కానీ షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు.దీంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి అటు నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.
కాగా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇటీవల బోయపాటి శ్రీను తల్లి చనిపోవడంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యింది.
అయితే ఇలాంటి అడ్డంకులు అన్నింటినీ పక్కనబెట్టి ఎట్టకేలకు ఈ చిత్ర షూటింగ్ను మొదలుపెట్టేందుకు బాలయ్య అండ్ టీమ్ రెడీ అయ్యారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మార్చి 2వ తేదీ నుండి నిర్విరామంగా జరిపేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు.
తొలి షెడ్యూల్ను హైదరాబాద్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్ను పూర్తి చేయాలని, అంతే త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య అండ్ టీమ్ ప్రయత్నిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.ఈ సినిమాలో శ్రియా సరన్, అంజలి హీరోయిన్లుగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.