నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ అఘోరా పాత్రకు సంబంధించి ఓ ముఖ్యమైన సీక్వెన్స్ వారణాసిలో షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.
కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి.దీంతో ఈ వారణాసి సీక్వెన్స్ను మార్చి రాస్తున్నాడట బోయపాటి.ఈ మార్చిన సీక్వెన్స్ను బాలయ్యకు వినిపించి, ఓకే చేయించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి కరోనా కారణంగా బాలయ్య సినిమా షూటింగ్లోనే కాకుండా సినిమా కథలో కూడా మార్పులు జరుగుతున్నాయి.
మరి బాలయ్య సినిమాలో బోయపాటి మార్చిన ఆ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే తిరిగి ప్రారంభించాలని బాలయ్య అండ్ టీమ్ భావిస్తున్నారు.