నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్బస్టర్ హిట్లు నిలవడంతో, ఈసారి రాబోయే సినిమా అంతకు మించిన విజయాన్ని అందుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమా టీజర్ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
కాగా బాలయ్య పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా తిరిగి పట్టాలెక్కించాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమా కోసం ముందుగా అనుకున్న భారీ బడ్జెట్ను చాలా వరకు తగ్గించనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా బడ్జెట్ను ఖచ్చితంగా తగ్గించాల్సి వస్తుందని, అటు బాలయ్యతో సహా మిగతా నటీనటులు, టెక్నీషియన్లు కూడా తమ రెమ్యునరేషన్ను తగ్గించుకోనున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు ఎలాంటి ఔట్డోర్ షూటింగ్ ఉండబోదని, సినిమాను పూర్తిగా ఇండోర్ షూట్తో ముగించేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ విధంగా చిత్ర నిర్మాతకు నష్టం కలగకుండా ఉండేందుకు బోయపాటి తగు చర్యలు తీసుకుంటున్నాడు.మొత్తానికి బాలయ్య సినిమా కోసం బోయపాటి తీసుకుంటున్న జాగ్రత్తలతో అభిమానులు ఆయన్ను మెచ్చుకుంటున్నారు.
ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.