నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు బోయపాటి, ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.గతంలో ఆయన తీసిన ‘వినయ విధేయ రామ’ దారుణమైన ఫెయిల్యూర్గా మిగలడంతో, ఈసారి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే బాలయ్య కోసం అదిరిపోయే పవర్ఫుల్ కథను బోయపాటి రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఈ కథ పూర్తిగా రివెంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో బాలయ్య తమ్ముడిగా యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపిస్తాడని, అతడని విలన్లు చంపేయడంతో వారిపై బాలయ్య ఎలా పగ తీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.రొటీన్ స్టోరీలైన్ అయినప్పటికీ, ఈ సినిమాను బోయపాటి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడని, అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాల టాక్.
ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పబోయే డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమట.
కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో అఘోరా పాత్ర కూడా ఉంటుందని, అది సినిమాకే హైలైట్గా నిలుస్తుందని చిత్ర వర్గాల టాక్.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ కొత్త బ్యూటీని హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
కానీ ఆమె ఎవరనే విషయాన్ని ఇప్పటివరకు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయకపోవడం గమనార్హం.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.