బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న “ఎన్ఠీఆర్ బయోపిక్” పై తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఈ చిత్రం రెండు భాగాల్లో నిర్మిస్త్తున్నారు.మొదటి భాగం ఎన్ఠీఆర్ సినీ జీవితం గురించి…రెండో భాగం రాజకీయ జీవితం గురించి.
ఇప్పటికే ఈ చిత్రంపై సంబందించిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.నారా చంద్రబాబు గా రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వర రావు గారి లాగా సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు.
బాలకృష్ణ పాత్రలో తారక్ నటిస్తున్నారు.?
అయితే తాజాగా ఎన్టీఆర్ కు సంభందించిన మరొక వార్త హల్ చల్ చేస్తోంది.సినిమా షూటింగ్ అధిక బాగం ఆ ఇంట్లో జరుగుతోందట.అప్పట్లో ఎన్టీఆర్ దాదాపు దశాబ్ధానికి పైగా అబిడ్స్ లో ఓ ఇంట్లో ఉన్నారట.
బంజారా హిల్స్ లో నివసించడానికి ముందు అబిడ్స్ లో ఉన్నారంట.ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొదలు పెట్టింది ఆ ఇంటినుండే అంట.ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన సన్నివేశాలను క్రిష్ ప్రస్తుతం అక్కడే చిత్రీకరిస్తున్నారు.ఇప్పటికే కొన్ని సన్నివేశాలను బాలయ్య పై అక్కడ చిత్రీకరంచారు.
అయితే బాలయ్య తొలి రోజు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారంట.తండ్రి నివసించిన ఇంటిలో కాలు పెట్టగానే ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చాయి.తండ్రితో ఉన్న అనుభూతులను…అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం చెందారు.ఇటీవలే ఆ ఇంట్లో షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అదనంగా సిబ్బందిని పెంచి షూటింగ్ చేస్తున్నారట.