బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఆదిత్య 369 అప్పటికి ఎప్పటికి గుర్తుండి పోయే సినిమా అనడంలో సందేహం లేదు.ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్ర టాప్ 100 సినిమాల జాబిత తీస్తే ఖచ్చితంగా అందులో ఈ సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
అప్పట్లోనే ఒక అద్బుతమైన విజయ్ తో దర్శకుడు సింగీతం ఆ విష్కరించిన సినిమా ఇది.బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమా అది.టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే అనుమానంను చాలా మంది వ్యక్తం చేశారు.కాని అనూహ్యంగా బాలకృష్ణ నటన ప్రతిభ మరియు సిగీతం వారి స్క్రీన్ ప్రజెన్స్ మరియు స్క్రీన్ ప్లే అన్ని విధాలుగా సెట్ అవ్వడంతో ఆదిత్య 369 గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం.
ఈ సినిమా మూడు పదుల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు తమ అనుబంధంను అనుభవాలను షేర్ చేసుకున్నారు.శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో బాలయ్య నటించడం అద్బుతం అన్నట్లుగా చెప్పుకున్న వారు చాలా మందే ఉన్నారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి అయిదు ఆరు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి.
సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.ఇటీవలే కూడా బాలయ్య మాట్లాడుతూ తన కొడుకు మరియు నేను కలిసి ఆదిత్య 369 ను సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
సీక్వెల్ కు కథ ను తానే స్వయంగా సిద్దం చేశాను అన్నాడు.దర్శకత్వం నేను లేదా సింగీతం వారు చేస్తారని అన్నాడు.మరి నేడు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమా సీక్వెల్ గురించి ఏదైనా కీలక ప్రకటన వస్తుందా అంటూ నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.