నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న అఖండ సినిమా బాలయ్య కేరీర్ లోనే టాప్ చిత్రంగా నిలిచింది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో అఖండ సాధించిన ఈ విజయంతో అభిమానులు పుల్ హ్యాపీగా ఉన్నారు.ఇదే సమయంలో బాలయ్య తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
అఖండ సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.క్రాక్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్య తో సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా లో తమిళ స్టార్ నటి వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తుంది.ఇంకా పలువురు సీనియర్ స్టార్స్ ఈ సినిమా లో నటిస్తున్నారు.
గోపీచంద్ మలినేని ఈ సినిమా లో బాలయ్య కు జోడీగా శృతి హాసన్ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే.
బాలయ్య కు జోడీగా మొదట శృతి హాసన్ నటించేందుకు నో అన్నదనే వార్తలు వచ్చాయి.
కాని ఆమెను గోపీచంద్ మలినేని ఒప్పించాడు.సినిమా షూటింగ్ అఖండ స్పీడ్ తో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అన్ని అనుకూలంగా ఉంటే సినిమా ను ఈ ఏడాది సమ్మర్ చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.అది సాధ్యం కాకుంటే సినిమా ను దసరాకు విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ తో బాలయ్య సంక్రాంతికి సందడి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.గత రెండు మూడు రోజులుగా బాలయ్య 107 సినిమా హడావుడి కనిపిస్తుంది.సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ టైటిల్ ను ప్రకటించి ఇప్పటి నుండే సినిమా ప్రమోషన్ చేస్తే బాగుంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట.
బాలయ్య లుక్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.