నందమూరి బాలకృష్ణ మొన్న సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేని దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య అభిమానుల్లో మంచి జోష్ నింపింది.ప్రస్తుతం బాలకృష్ణ తన తదుపరి సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.
వీర సింహా రెడ్డి సినిమా విడుదలకు ముందే అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య తదుపరి సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.తాజాగా రెండో షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి పలువురు హీరోయిన్స్ ని సంప్రదించి చివరకు కాజల్ అగర్వాల్ ని కన్ఫర్మ్ చేశాడని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఈ వార్త మీడియా లో చక్కర్లు కొడుతుంది.తాజాగా ఈ విషయమై మరో సారి క్లారిటీ వచ్చింది.ఒకటి రెండు రోజుల్లోనే చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని బాలకృష్ణ కి జోడి గా ఎంపిక చేసినట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్ లో గతంలోనే సినిమా రావాల్సి ఉన్నా.కూడా కొన్ని కారణాల వల్ల రాలేదు.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.కాజల్ అగర్వాల్ పెళ్లయి తల్లి అయిన తర్వాత బాలకృష్ణ తో నటించేందుకు ఓకే చెప్పింది.చిరంజీవితో పాటు పలువురు సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్ ఈసారి బాలయ్య తో జత కట్టబోతుంది.బాలయ్య మరియు కాజల్ యొక్క కాంబో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నాడట.