నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాను కరోనాకు ముందు అంటే 2019 లో మొదలు పెట్టాడు.కరోనా రెండు వేవ్ ల వల్ల సినిమా ఏకంగా రెండేళ్లు ఆలస్యంగా వస్తోంది.
కరోనా గ్యాప్ లో ఒక్కో హీరో రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యారు.ఇప్పుడు బాలయ్య కూడా అదే పని చేస్తున్నాడు.
ఇప్పటికే బాలయ్య అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉండటంతో.తదుపరి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.
ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి.షూటింగ్ రెగ్యులర్ గా జరిపేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాలయ్య మరియు గోపీచంద్ మలినేనిల కాంబోలో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ డిసెంబర్ లో అఖండ రాబోతుండగా వచ్చే ఏడాదిలో గోపీచంద్ మలినేని సినిమాను బాలయ్య ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
ఆ తర్వాత బాలయ్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.
ఇప్పటికే వీరి కాంబో మూవీ కూడా దాదాపుగా ఓకే అయ్యింది.మరి కొన్ని రోజుల్లోనే ఆ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్ ను ముగించే పనిలో అనీల్ రావిపూడి ఉన్నాడు.
ఫిబ్రవరిలో ఎఫ్ 3 విడుదల అవ్వబోతుంది.ఆ వెంటనే బాలయ్య తో సినిమాను మొదలు పెట్టాలని నిర్ణయించారు.
అందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.అనీల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది.
అందుకే ఎఫ్ 2 మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలు మాత్రమే కాకుండా అంతకు ముందు సినిమాలు కూడా సంక్రాంతికే వచ్చాయి.సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి.
కనుక ఆయన ఎఫ్ 3 ని కూడా సంక్రాంతికి అనుకున్నా కూడా వీలు పడటం లేదు.అయితే బాలయ్యతో చేయబోతున్న సినిమా మాత్రం 2023 సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.