కరోనా కారణంగా తెలుగు సినిమాల షూటింగ్స్ పూర్తిగా నిలిచి పోతున్నాయి.కాని ఒకటి రెండు మాత్రం ఇంకా లైన్ లో ఉన్నాయి.
షూటింగ్ ను జరుపుకుంటూనే ఉన్నాయి.చిన్న సినిమా లు మాత్రం షూటింగ్ ను జరుపుకుంటూ ఉన్నాయి.
కరోనా భయం లేకుండా కొన్ని సినిమాల షూటింగ్ జరుపుకుంటున్నాయి.వాటిలో అఖండ సినిమా షూటింగ్ ను కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
అఖండ సినిమా షూటింగ్ ను ఒకటి రెండు వారాల్లోనే ఈ సినిమా ను పూర్తి చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.మొదట అనుకున్న దాని ప్రకారం అయితే ఈ సినిమాను ఈ నెల చివరి వారంలో విడుదల చేయాలని భావించారు.
కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ను వాయిదా వేసినట్లుగా వార్తలు వచ్చాయి.దాంతో సినిమా ను విడుదల తేదీ కూడా మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
విడుదల తేదీ మారడం ఖాయం కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న తేదీకే పూర్తి చేస్తారని అంటున్నారు.
బోయపాటి మరియు బాలకృష్ణ లు ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.
అత్యంత కఠిన జాగ్రత్తలు తీసుకుంటూ అఖండ సినిమాను పూర్తి చేస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా ను షూటింగ్ పూర్తి చేసి రెండు మూడు వారాల గ్యాప్ తో పూర్తి చేసి కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా వంద కోట్లు వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.బోయపాటి శ్రీను మరియు బాలయ్య ల కాంబోలో గతంలో వచ్చిన సినిమా లు రెండు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
దాంతో అఖండ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.