నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.డిసెంబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.
వీరిద్దరి కాంబోలో సింహా మరియు లెజెండ్ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక ఈ సినిమా రేంజ్ మామూలుగా లేదు.
అఖండ సినిమా ను ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయి లో విడుదల చేస్తున్నారు.బాలయ్య బోయపాటి కాంబోలో రూపొందిన ఈ అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వచ్చే వారంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు నాచురల్ స్టార్ నాని లు ముఖ్య అతిధులుగా ఈ వేడుక జరుగబోతున్నట్లుగా చెబుతున్నారు.
నాని మరియు ఎన్టీఆర్ లు వచ్చి బాలయ్య అఖండ సినిమా కు ఆల్ ది బెస్ట్ చెప్పనున్నారు.
బాలయ్య కు నాని సన్నిహితుడు.ఇక ఎన్టీఆర్ తో కూడా బాలయ్య కు ఆ మద్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు అవేం లేవు.
అంతా బాగానే ఉంది.కనుక వీరిద్దరు కూడా అఖండ ప్రీ రిలీజ్ వేడుక లో పాల్గొంటారు అంటున్నారు.
నాని మరియు ఎన్టీఆర్ లతో ఒకే సారి బాలయ్య స్టేజ్ షేర్ చేసుకోబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి అఖండ వేడుక పై పడింది.ఈ వేడుక ను ఏపీ లో మరియు హైదరాబాద్ లో రెండు సార్లు నిర్వహించబోతున్నారు.మరి ఈ ఇద్దరు స్టార్స్ ఒకే సారి వస్తారా లేదంటే అక్కడికి ఒకరు ఇక్కడికి ఒకరు వస్తారా అనేది చూడాలి. ఇప్పటికే అఖండ కు భారీ బిజినెస్ అయ్యిందని అంటున్నారు.
మరి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.