ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమా చేస్తున్నాడు.మొన్నటి వరకు టైటిల్ విషయంలో ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.
అందుకే అభిమానుల కోసం ఉగాది పండుగ రోజు బాలయ్య బోయపాటి ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు.ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను విడుదల చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.
బోయపాటి, బాలయ్య సినిమా అంటే ముందే అంచనాలు పెరిగాయి.ఇంకా విడుదలైన టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఇంత వరకు బాలయ్యను చూడని సరికొత్త లుక్ లో కనిపించడం ఆ లుక్ కూడా ఆయనకు సెట్ అవ్వడంతో విడుదలైన టీజర్ రికార్డులు సృష్టించింది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
విలన్ రోల్ లో కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కూడా వాయిదా పడింది.
అయితే ఈ సినిమాపై ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఈ సినిమాకు ఉపయోగించే బడ్జెట్ బాలయ్య కెరీర్ లోనే అత్యధికం అనే టాక్ వస్తుంది.ఈ సినిమాకు 60 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని గాసిప్ చక్కర్లు కొడుతోంది.
మనం ఇప్పటికే టీజర్ చూస్తేనే తెలుస్తుంది ఈ సినిమాను ఏ లెవల్ లో తెరకెక్కిస్తున్నారో.అందుకే ఈ సినిమా కోసం ఎక్కువ బడ్జెట్ అవుతుందని సమాచారం.