నటసింహం నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజులుగా హిట్స్ లేక బాధపడుతున్నాడు.ఈయన సినిమాలు విడుదల అయినా కూడా జనాలు అంతగా పట్టించుకోవడం లేదు.
హిట్స్ లేక ఆయన మార్కెట్ కూడా తగ్గిపోయింది.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.
బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.
ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.
ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో బాలయ్య కనిపించాడు.
ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమా పాటల విషయంలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్య థమన్ నుండి వచ్చిన పాటలన్ని సూపర్ హిట్ అవుతున్నాయి.
అయితే ఈ సినిమా ఆల్బమ్ ఇప్పటికే థమన్ రెడీ చేసినట్టు సమాచారం.ఈ ఆల్బం కూడా థమన్ అంచనాలు పెంచేలా చేసాడని అందరు భావిస్తున్నారు.ఈ ఆల్బమ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది.
ఈ ఆల్బమ్ ను ఎన్టీఆర్ జయంతి కానుకగా విడుదల చేయాలనీ చిత్ర యినిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తం ఆల్బం కాకపోయినా కనీసం ఒక్క పాటను అయినా ఆ రోజు విడుదల చేయనున్నారని టాక్.
మరి చూడాలి ఇందులో నిజమెంతో.