బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటి కత్రినా కైఫ్.బ్రిటన్ నుంచి వచ్చి బాలీవుడ్ లో సక్సెస్ అయినా విదేశీ భామగా కూడా కత్రినా గుర్తింపు తెచ్చుకుంది.
ఇలా అతి కొద్ది మంది మాత్రమే ఫారిన్ నుంచి వచ్చి బాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు.ఈ వరుసలో అమీ జాక్సన్ కూడా ఉంటుంది.
అయితే ఈ బ్రిటన్ భామకి కత్రినా కైఫ్ స్థాయిలో బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు.అయితే కత్రినా కైఫ్ తనని తాను మెరుగుపరుచుకుని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినా కూడా ఆమె కెరియర్ ఆరంభంలో తెలుగు సినిమాలలో పడిన బీజమే కారణం అని చెప్పాలి.
కెరియర్ ఆరంభంలో కత్రినా కైఫ్ మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలలో నటించింది.ఇందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అల్లరి పిడుగు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమా కారణంగా తాను చాలా విషయాలు నేర్చుకున్న అని కత్రినా చెబుతుంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో బాలకృష్ణతో అల్లరి పిడుగు చేసే సమయంలో తనకి డాన్స్ అస్సలు రాదని చెప్పింది.
అయితే బాలకృష్ణ చాలా మంచి డాన్సర్ అని, తనలోని బెరుకు చూసి ఆయనే దగ్గరుండి చాలా ఓపికగా నాతో స్టెప్పులు ఎలా వేయాలో చెప్పేవారని, ఆయన సూచనలు తీసుకొని డాన్స్ లో మెళుకువలు తెలుసుకున్నా అని చెప్పింది.ఓ విధంగా చెప్పాలంటే బాలకృష్ణ తనకి గురువులాంటి వారని, ఆయన కారణంగానే డాన్స్ లో తాను పెర్ఫెక్ట్ అయ్యానని, ఈ రోజు మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నానని చెప్పింది.
అలాగే తనలోని నటనని మెరుగు పరుచుకోవడానికి తెలుగు సినిమాలు చాలా ఉపయోగపడ్డాయని కత్రినా కైఫ్.
.