నందమూరి బాలకృష్ణ ఫేస్ బుక్ లో ఒలింపిక్స్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.ఇటీవల బ్యాడ్మింటన్ లో కాంస్యం పథకంను దక్కించుకుని భారత క్రీర్తి పతాకాన్ని బ్యాడ్మింటన్ రంగంలో రెపరెపలాడించిన పీ వీ సింధును ఎంతో మంది అభినందించారు.
ఇప్పుడు అదే విధంగా బాలకృష్ణ కూడా తనవంతు బాధ్యతతో పీ వీ సింధుకు అభినందనలు తెలియజేశాడు.తనదైన శైలిలో పీ వీ సింధు గురించి ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టాడు.
బాలకృష్ట ఫేస్ బుక్ లో.ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత దేశ పతాకాన్ని మరోసారి ఎగురవేసిన మన తెలుగు తేజం పీ వీ సింధు కి నా శుభాభినందనలు.తన ఈ విజయం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలని.మరెందరో పీ వీ సింధు మాదిరిగా భారత దేశంకు పతకాలు తీసుకు రావాలని పేరు ప్రతిష్టలను తెచ్చి పెడతారని ఆశిస్తున్నాను అంటూ బాలయ్య పోస్ట్ చేశాడు.
బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.ఇటీవలే చెన్నైలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.అందుకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడంతో తుది షెడ్యూల్ కు సినిమా ను ప్లాన్ చేస్తున్నారు.దాంతో ప్యాచ్ వర్క్ ను ముగించి సినిమా ను విడుదలకు సిద్దం చేస్తారని అంటున్నారు.
దసరా కానుకగా విడుదల చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.అఖండలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.
పూర్ణ కూడా కీలక పాత్ర లో కనిపించబోతుంది. అఖండ సినిమా తో బోయపాటి మరో భారీ సూపర్ హిట్ ను ఖచ్చితంగా బాలయ్యకు ఇస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.