టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు రాజ్యం ఏలాయి.మద్యలో కొన్నాళ్ల పాటు మల్టీ స్టారర్ సినిమా ల ఊసే లేదు.
మళ్లీ ఇప్పుడు ఆ సందడి కొనసాగుతుంది.ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే.
ఇక పవన్ కళ్యాన్ మరియు రానాలు కలిసి భీమ్లా నాయక్ చేస్తున్నారు.అంతకు ముందు పవన్.
వెంకీ కలిసి ఒక మల్టీ స్టారర్ చేశారు.సీనియర్ హీరోలు మరియు యంగ్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ లు మరిన్ని చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
త్వరలో ఒక ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.కొరటాల శివ ఆ మల్టీ స్టారర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
బాలకృష్ణ మరియు మహేష్ బాబులతో మల్టీ స్టారర్ ను కొరటాల శివ చేయబోతున్నాడు అనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి.వీరిద్దరి కాంబోలో సినిమా అంటే మరో రేంజ్ లో ఉంటుంది.
ఇప్పటికే వెంకీ తో సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాను చేసిన మహేష్ బాబు ఇప్పుడు బాలయ్య తో మంచి కథ వస్తే ఖచ్చితంగా చేస్తాడు.
అది కూడా తనకు శ్రీమంతుడు.భరత్ అనే నేను సినిమా లు ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో అయితే కళ్లు మూసుకుని మరీ సినిమా లను చేసేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో కొరటాల శివ నుండి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
అయితే ఇద్దరు హీరోలు కూడా వారి వారి సినిమా లతో బిజీగా ఉన్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీరి కాంబో మల్టీ స్టారర్ 2023 లో ఉంటుందేమో చూడాలి.