తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖండ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది.సాదారణంగా బాలయ్య అభిమానులు తక్కువ వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేస్తూ ఉంటారు.
కాని ఈ సినిమా విషయంలో మాత్రం చాలా ఆలస్యం జరిగింది.పెద్ద ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా విడుదల తేదీ విషయంలో తాజాగా ఒక అనధికారిక సమాచారం అందుతోంది.
ఆ సమాచారం ప్రకారం సినిమా ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెద్ద ఎత్తున అంచనాలున్న అఖండ సినిమాను బోయపాటి ఏకంగా 111 రోజల పాటు చిత్రీకరించాడట.ఇంత భారీ మొత్తం లో డేట్లు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఖచ్చితంగా 40 నుండి 50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యి ఉంటుంది అనేది టాక్.
బాలయ్య మూవీకి అంత బడ్జెట్ అయ్యింది అంటే కాస్త రిస్కీ ప్రాజెక్ట్ అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
సినిమా సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా 50 నుండి 60 కోట్ల వరకు వసూళ్లు వస్తాయి.ఇతర బిజినెస్ జరుగుతుంది.కాని బాలయ్య సినిమా నిరాశ పర్చితే కనీసం పది కోట్లు కూడా వసూళ్లు వచ్చే అవకాశం ఉండదు.
అందుకే పాతిక కోట్ల కంటే ఎక్కువ పెట్టి బాలయ్య మూవీని తీయడం అనేది చాలా రిస్కీ విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా ను ఖచ్చితంగా సూపర్ హిట్ అన్నట్లుగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించాడు.కనుక ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అఖండ సినిమా చివరి దశ పనులు ఉజరుగుతున్నాయి.బాలయ్య బోయపాటికి ఇది హ్యాట్రిక్ అవ్వబోతుందా అనేది చూడాలి.