ఈ మధ్య కాలంలో బాలా కోట్ మళ్లీ మిలిటెంట్స్ డెన్ గా మారిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.సరిగ్గా 7 నెలల క్రితం… పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ పరిధిలోని బాలాకోట్ పై వైమానిక దాడులు జరిగాయి.
భారత వాయు సేన బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.పాకిస్థాన్కు చెందిన ఎఫ్ 16ను కూడా వాయుసేన కూల్చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న వైమానిక దాడులు జరిగితే అప్పటి నుంచి బాలాకోట్లో పెద్దగా ఉగ్రవాద కదలికలు లేవు.అయితే ఇటీవల బాలా కోట్ ను మరోసారి ఉగ్రవాదుల డెన్ గా మార్చేసింది అంటూ ఆర్మీ చీఫ్ కూడా తెలిపారు.
మనదేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు 500 వందల మందికి పైగా మిలిటెంట్లు సరిహద్దుల్లో మాటువేసినట్లు అధికారులు చెబుతున్నారు.ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడం తో పాక్ యుద్ధం కి సై అంటూ వ్యాఖ్యలు చేస్తున్న పాక్ ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఉగ్రమూకలను ఎగదోస్తున్నట్లు అర్ధం అవుతుంది.
బాలాకోట్లో ఉగ్రవాదుల శిబరాలు యాక్టివ్గా మారడం వెనుక పాక్ హస్తముందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెబుతున్నారు.టెర్రరిస్టులు క్రియాశీలంగా మారడానికి పాక్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.
ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వ నీతి మరోసారి బయటపడింది.ఒకపక్క ఆర్టికల్ 370 రద్దుపై రాద్దాంతం చేసి, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల నిర్మూలనకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.