ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి… నోటిలోంచి శివలింగాలు తీస్తూ… భగవాన్ బాల సాయిబాబా గా గుర్తింపు పొందిన కర్నూల్ జిల్లాకు చెందిన బాల సాయిబాబా ఈ రోజు అకస్మాత్తుగా… గుండెపోటుతో మరణించారు.సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ దోమలగూడ లో ఉంటున్న బాల సాయిబాబాకు అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో… వెంటనే ఆయన సిబ్బంది … బంజారాహిల్స్లోని విరంచి ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు.బాల సాయి బాబా వయస్సు 58 సంవత్సరాలు కాగా ఆయన స్వస్థలం కర్నూలు.ఆశ్రమ సిబ్బంది బాల సాయి బాబా అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని కర్నూలుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు