సల్మాన్ హీరోగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా వచ్చిన సినిమా బజరంగీ భాయిజాన్.ఈ సినిమా ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది.
కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా హెల్ప్ అయ్యింది.ఈ సినిమా హిట్ అవడంలో బాహుబలి రైటర్ ప్రాధాన్యత ఎక్కువే ఉందని చెప్పొచ్చు.
ఇక ఈ క్రమంలో 6 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వల్ కథను సిద్ధం చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.
ఈమధ్యనే బజరంగీ భాయిజాన్ కొనసాగింపు కథ ఆలోచన వచ్చిందట.
ఆ లైన్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వినిపించారట రైటర్ విజయేంద్ర ప్రసాద్.సల్మాన్ ఖాన్ కు సీక్వల్ లైన్ బాగా నచ్చేయడంతో సినిమా చేసేద్దాం అన్ని చెప్పేశారట.
సో త్వరలోనే సూపర్ హిట్ మూవీ బజరంగీ భాయిజాన్ సినిమాకు పార్ట్ 2 గా మరో సినిమా వస్తుందని చెప్పొచ్చు. విజయేంద్ర ప్రసాద్ కథ రాశారంటే అందులో కచ్చితంగా విషయం ఉన్నట్టే.
మరి ఈ సినిమా పార్ట్ 2 ఎలా ఉంటుందో చూడాలి. సల్మాన్ ఖాన్ మాత్రం ఈ సినిమా సీక్వల్ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడని అంతకుముందే తెలిసింది.
అయితే ఇన్నాళ్లకు ఆ సీక్వల్ కథ సెట్ అయ్యిందని తెలుస్తుంది.