బాలీవుడ్ క్వీన్స్ దీపికా పదుకొనే, ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.
వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు.తమదైన శైలిలో నటిస్తూ, తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరూ ఒక డైరెక్టర్ కోసం పోటీ పడుతున్నారట.ఎందుకు?ఏమిటి? ఈ విషయాల గురించి తెలుసుకుందాం.
దీపికా పదుకొనే, ఆలియా భట్ సంజయ్ లీలా బన్సాలీ నెక్స్ట్ లీడ్ రోల్ కోసం పోటీ పడుతున్నారట.బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ బైజూ బ్రావా సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యారు.
ఈ సినిమా కోసం ఇప్పటికే దీపికను అడగగా అందుకు ఆమె రణ్ వీర్ సింగ్ తో సమానంగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట.దీనితో ఆ విషయానికి సంజయ్ లీలా భన్సాలీ ఆమెకు ఫుల్ స్టాప్ పెట్టేసారు.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం మరొక స్టార్ హీరోయిన్ వైపుగా మొగ్గు చూపాడు.
గంగుబాయి కాకతీయావాడి సినిమాలో ఆలియాభట్ పర్ఫామెన్స్ కు ఫిదా అయిన సంజయ్,ఆలియాకు స్టొరీ చెప్పడంతో ఆమె చాలా ఇంప్రెస్ అయిందట.అంతేకాకుండా ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట.ఇప్పటివరకు ఈ సినిమాకి హీరోయిన్ ఫైనల్ కాకపోగా, ఆలియాభట్ దీపికా పదుకొనే ఇద్దరు కూడా ఈ సినిమా చేసేందుకు ఎక్కువగానే ప్రయత్నిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమాలో చివరగా ఏ హీరోయిన్ ఫైనల్ చేస్తారన్నది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.