బహ్రెయిన్ లో చాలా ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న 125 మందికి భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది.జిల్లాలో మగ్గుతున్న భారతీయాలలో చాలా మంది ఏవో చిన్న చిన్న కారణాలతో శిక్షలు అనుభావిస్తున్నవారే.
తప్పుడు వీసాతో గల్ఫ్ వెళ్ళడం, వీసా గడువు ముగిసిన కూడా అక్కడే ఉండిపోవడం వంటి కారణాలతో వీరిని ఖైదులుగా చేశారు.అయితే కరోనా కారణంగా అక్కడి రాజు వారికి క్షమాభిక్ష ఇచ్చి విడిచిపెట్టారు.
విడుదలైన వారంతా ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు.అనంతరం వారందరినీ నావికాదళ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
కొచ్చికి వచ్చిన విమానంలో బహ్రెయిన్కు చెందిన 60 మందిని పంపించినట్టు పేర్కొన్నారు.
కొచ్చికి చేరుకున్న వారంతా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 14 రోజులపాటు మిలటరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు.
క్వారంటైన్ ముగిసిన తర్వాత వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపిస్తామన్నారు.మరోవైపు, కరోనా లాక్డౌన్ కారణంగా దుబాయ్, అబుధాబిలలో చిక్కుకుపోయిన 347 మంది భారతీయులు ఆదివారం రెండు విమానాల్లో ఎర్నాకుళం చేరుకున్నారు.
వీరికి కూడా అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.