కొంత మంది హీరోయిన్లకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినప్పటికీ బాలీవుడ్ పై ఉన్నటువంటి మక్కువ కారణంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలతో సినీ కెరీర్ ని పోగొట్టుకున్న నటీ నటులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే ఇందులో టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” దర్శకత్వం వహించిన “బద్రి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “అమీషా పటేల్” కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే వచ్చి రావడంతోనే అమీషా పటేల్ కి మంచి హిట్ దక్కడంతో ఈ అమ్మడికి టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది.అంతేకాకుండా అవకాశాలు కూడా బాగానే క్యూ కట్టాయి.
అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో అమీషా పటేల్ బాలీవుడ్ సినిమా పరిశ్రమపై మనసు పారేసుకుంది.ఈ క్రమంలో పలు టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ కాదనుకుంది.
ఈ క్రమంలో అనుకున్నదే తడవుగా మూటాముల్లె సర్దుకుని ముంబైకి వెళ్ళి పోయింది.అయితే కొంతకాలం పాటూ బాలీవుడ్లో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణించినప్పటికీ ఎక్కువగా డిజాస్టర్లను ఎదుర్కోవడంతో ఈ ప్రభావం సినిమా కెరియర్ పై పడింది.
దీంతో ఒకప్పుడు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, వంటి సార్ హీరోలతో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ ప్రస్తుతం బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలలో నటించడానికి పరిమితమైంది.
అయితే తాజాగా నటి అమీషా పటేల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటో కారణంగా సోషల్ మీడియాలో మరోమారు హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో అమీషా పటేల్ తన ఎద అందాలను ఆరబోస్తూ టాప్ లెస్ దుస్తులను ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.దీంతో ఈ అమ్మడి హాట్ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
అంతేకాకుండా అమీషా పటేల్ కి 46 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ వన్నె తరగని అందంతో కుర్రకారు మతి పోగొడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరైతే పెళ్లయిన మహిళలు ఇలా ప్రైవేటు శరీర భాగాలు కనిపించే విధంగా ఫోటోలకి ఫోజులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఈ ఫోటోలన్నీ డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అమీషా పటేల్ హిందీలో “ఫౌజి బ్యాండ్” అనే చిత్రంలో ప్రధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.